సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని, అందుకే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆయన అన్నారు. బాధితులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే పరిహారం చెల్లించకపోతే కలెక్టరేట్ ముందు దీక్ష చేస్తానని హెచ్చరించారు. బాధితుల ఆర్తనాదనలు మిన్నంటుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదంటూ విలేకర్ల ముందు ఆయన నిప్పులు చెరిగారు.