పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సాయం చేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలని సూచించింది. బాధితులకు పరిహారం చెల్లించడంలో ఆలస్యం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రమాదంపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 27కి వాయిదా పడింది. పూర్తి వివరాలు మీ కోసం