సినిమా నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేస్తున్నారని, ఇది టిక్కెట్ ధరలపై పడుతుందని.. సామాన్యులు థియేటర్కు వెళ్లి సినిమా చూడలేని పరిస్థితి ఎదురవుతుందని పేర్కొంటూ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీతో విచారణ జరిపించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మేము ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అలా చేస్తే న్యాయ విచారణ దుర్వినియోగమే అవుతుందని పిల్ను తిరస్కరిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.