సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ శివారులోని ఓ వివాదాస్పద భూమి విషయంలో ఆయనకు హయత్నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లేని భూమిని ఉన్నట్లు సృష్టించి ప్లాటు విక్రయించారని బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. విజయ్ చౌదరి అనే వ్యక్తిపై కేసు నమోదు అయింది. ఇదే వివాదంలో రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ చేశారు.