రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొంతమంది ఉపాధి కూలీలకు వింత కష్టాలు వెంటాడుతున్నాయి. వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లి తలనీలాలు సమర్పించుకున్న కొంతమంది ఉపాధి కూలీలు.. ఫేస్ యాప్ తమను గుర్తించకపోవటంతో షాక్ తిన్నారు. అయితే తమ క్రియేటివిటికి పదును పెట్టి సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అటు నంద్యాల జిల్లా డోన్ మండలంలోనూ ఇదే తరహా సమస్య ఓ వ్యక్తికి ఎదురైంది.