సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ సంచలనం రేపింది. పానీపూరి తిన్న 20 మంది చిన్నారులు అస్వస్థతకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. సాయంత్రం పానీపూరి తిన్న చిన్నారులు.. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరికి తీవ్రమైన జ్వరం, ఫిట్స్ వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తం అయ్యాయి.