రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. సిగరెట్ తాగొద్దని తండ్రి మందలించటంతో మనస్తాపం చెందిన ఓ పదో తరగతి స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకొని తనువు చాలించాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.