తెలంగాణ అదనపు డీజీపీ మహేశ్ భగవత్ సివిల్స్ అభ్యర్థులకు వాట్సప్ ద్వారా ఉచిత శిక్షణ అందించి మరోసారి సత్తా చాటారు. ఆయన శిక్షణలో 200 మందికి పైగా అభ్యర్థులు సివిల్స్-2024లో ర్యాంకులు సాధించారు. టాప్-100 ర్యాంకర్లలో 21 మంది ఆయన శిష్యులు ఉండటం విశేషం. ఒకప్పటి కానిస్టేబుల్ కుమారుడు సాయి చైతన్య 68వ ర్యాంకు సాధించి గురుశిష్యుల అనుబంధానికి నిదర్శనంగా నిలిచారు.