సీఎం చంద్రబాబును కలిసేందుకు వృద్ధురాలి పడిగాపులు.. కారణం వెనుక కదిలించే కథ..

1 month ago 3
సీఎం చంద్రబాబు గుంటూరు పర్యటనలో ఓ వృద్ధురాలు ఆయనను కలిసేందుకు గంటల తరబడి నిరీక్షించారు. తన కొడుకు పెళ్లైన మూడు నెలలకే అనుమానాస్పద రీతిలో చనిపోయాడని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు చనిపోయి ఇప్పటికి ఐదేళ్లు దాటిపోయిందని.. అయినా కేసు అతీగతీ లేదని.. దీంతో చంద్రబాబును కలిసి తన గోడు వెళ్లబోసుకుందామని వచ్చినట్లు తెలిపారు. అయితే పోలీసులు అనుమతించకపోవటంతో ఆమె ఏడుస్తూ ఉండిపోయారు. విషయం తెలుసుకున్న ఏపీ గ్రంథాలయాల ఛైర్మన్ చంద్రబాబును కలిసేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Read Entire Article