ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి పర్యటన నిమిత్తం బందోబస్తు విధులకు హాజరైన మహబూబ్నగర్ డీఎస్పీ, డ్రైవర్ తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. జడ్చర్ల వద్ద వారి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్రంగా గాయపడ్డారు. డీఎస్పీకి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జడ్చర్ల ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి డీఎస్పీని పరామర్శించారు. ఆ వివరాలు..