తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు 'ఈగల్ వ్యవస్థ'ను ప్రారంభించింది. హైదరాబాద్లో ఈగల్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ ప్రత్యేక బృందంలో శిక్షణ పొందిన గద్దలు డ్రగ్స్, గంజాయి ఆనవాళ్లను పసిగడతాయని చెప్పారు.