తెలంగాణలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రి సీతక్క పలువురు మంత్రులకు రాఖీ కట్టి ఆత్మీయ బంధాన్ని చాటుకున్నారు. రాఖీ కట్టిన సీతక్కకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చీర కొనుక్కో అంటూ నోట్ల కట్టను తీసిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆయన మనవడికి కూడా సీతక్క రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.