స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు 'జాయిన్ ది రైజ్' అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను చిరంజీవి ఆసక్తిగా వీక్షించారు. ఈ క్రమంలో చిరంజీవితో మాట్లాడిన రేవంత్.. ఇటీవలే తాను 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా కుటుంబంతో కలిసి చూసినట్లు తెలిపారు. తనకు సినిమా ఎంతో నచ్చిందని చిరంజీవిని అభినందించారు రేవంత్.