తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రెవంత్ రెడ్డి అరుదైన ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిిటీ నుంచి ఆయన ఓ ఆహ్వానం వచ్చింది. ఆ యూనివర్సిటీకి చెందిన కెన్నెడీ స్కూల్ తొలిసారిగా ఏఐ పాలసీ సింపోజియం నిర్వహిస్తుంది.. ఈ సింపోజియంంలో ప్రసంగించాలని సీఎంను కోరుతూ ఆహ్వానం పంపింది. అయితే, భారత్ నుంచి కేవలం తెలంగాణ సీఎం ఒక్కరికే ఆహ్వానం అందింది. జనవరిలో సీఎం ఆ యూనివర్సిటీలో కోర్సు చేసిన విషయం తెలిసిందే.