సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డెడ్ లైన్ విధించారు. ఎన్నికల సమయంలో మహిళకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవం (మార్చి 8న) వరకు రేవంత్ రెడ్డి ప్రకటన చేయకపోతే.. ఉద్యమం చేస్తామని తెలిపారు. పది వేల మంది మహిళలు.. 10 వేల గ్రామాల్లోకి వెళ్తారని.. లక్షల్లో పోస్టు కార్డులు తయారు చేసి డైరెక్టుగా సోనియా గాంధీకి పంపిస్తామని హెచ్చరించారు.