గతంలో దాఖలైన కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట కలిగింది. ఆయనపై దాఖలైన పలు కేసుల్లో కోర్టుకు హాజరు కావడం నుంచి మినహాయింపును కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలను చేశారని నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలుకు పిటిషనర్కు ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో రేవంత్ రెడ్డిని ప్రత్యక్ష కోర్టు విచారణ నుంచి మినహాయింపు కల్పించింది.