ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ పాలన కంటే ఎవరైనా బాగా చేస్తారని ఎద్దేవా చేస్తూ.. అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేసులో భట్టి విక్రమార్క మాత్రమే కాకుండా.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా పోటీలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాల హామీలు అబద్ధమని.. పీజేఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ అణగదొక్కిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు.