నిజాయితీపరుడిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్అలీ ముర్తజా రిజ్వీ వ్యక్తిగత కారణాలు చూపుతూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అయితే ఆయన వీఆర్ఎస్కు ఉత్తర్వులు జారీ అయిన తర్వాత ఎక్సైజ్శాఖ మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం చర్చకు దారి తీసింది. రిజ్వీ వీఆర్ఎస్కు రాజకీయ ఒత్తిళ్లు కారణమనే అనుమానాలను బలపరుస్తోంది.