పత్తి కొనుగోలుపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) విధించిన ఆంక్షలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎకరానికి కేవలం ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలంటూ సీసీఐ విధించిన నిబంధనను తక్షణమే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా ఒత్తిళ్లతో పత్తి దిగుమతి సుంకాలు ఎత్తివేయడం వల్ల దేశీయ మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.