జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొన్నటి మొంథా తుఫాన్ నుండి కోలుకుంటున్న రైతులకు సుడిగాలి మరోసారి షాక్ ఇచ్చింది. లెంకలగడ్డ సమీపంలో గోదావరిలో ఏర్పడిన వాటర్ స్పౌట్ ధాటికి వందలాది చెట్లు నేల కూలాయి. పదుల ఎకరాల్లో పంటలు నేలమట్టమయ్యాయి. సుడిగాలి దెబ్బకు పొలాల్లో పనిచేస్తున్న రైతులు చెట్లను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ సుడిగాలి అటవీ ప్రాంతంలో బీభత్సం సృష్టించింది. గత సంవత్సరం కూడా ఇలానే ములుగు జిల్లా మేడారంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఆ వివరాలు..