సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలపై క్రిమినల్ కేసులు పెట్టొద్దని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే అప్పీల్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. కాగా, కేవలం రాజకీయ విమర్శలకే కేసులు పెట్టడం సరికాదని, పరువు నష్టం ఫిర్యాదులపై నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదని ఇటీవల తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.