హైడ్రాకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. బతుకమ్మకుంట వివాదానికి సంబంధించి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బతుకమ్మకుంటలో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులు, శిలాఫలకాలను వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ భూమి వివాదం కోర్టు పరిధిలో ఉండగానే.. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టారని.. ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. హైడ్రాకు కీలక ఆదేశాలిచ్చింది.