సూర్యాపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. వాట్సప్ గ్రూప్లో పెట్టిన ఒక ఎమోజీ కారణంగా మానుపురి కృపాకర్ (54) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పద్మశాలీ సంఘం ఎన్నికల నేపథ్యంలో నిధుల గోల్ మాల్ ఆరోపణలపై శ్రీరాముల రాములు అనే వ్యక్తి పెట్టిన పోస్ట్కు వ్యతిరేకంగా కృపాకర్ ఎమోజీ పెట్టాడు. దీంతో ఆగ్రహించిన రాములు, అతని కుమారుడు ధనుంజయ్ మరికొందరితో కలిసి కృపాకర్పై దాడి చేయగా, ఆయన ప్రాణాలు కోల్పోయారు.