సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జువెల్లర్స్లో భారీ దోపిడీ జరిగింది. దుండగులు ఏకంగా 18 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ చోరీ జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. దొంగలు షాపు వెనుక గోడకు రంధ్రం చేసి, గ్యాస్ కట్టర్తో లాకర్లు ధ్వంసం చేసి బంగారాన్ని దోచుకెళ్లారు. ఉదయం యజమాని చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.