సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. డాక్టర్ నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా కోట్లు సంపాదించారని ఈడీ అనుమానిస్తోంది. ఆమె కార్యకలాపాలు ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. నిరుపేద కుటుంబాల పిల్లలను కొనుగోలు చేసి, సంతానం లేనివారికి అమ్మినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో 40 కోట్ల రూపాయల వరకు మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు.