ప్రజా ప్రభుత్వమని ప్రకటించిన రేవంత్ రెడ్డి, ప్రజల కోసం ప్రజావాణి, విజిటర్ అవర్స్ ఏర్పాటు చేశారు. అయితే, ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చిన రోజు సందర్శకులను అనుమతించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం సీఎం వచ్చినప్పుడు విజిటర్స్ పాసులు ఉన్నా అనుమతించలేదు. ఈ ఆంక్షలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో లేని విజిటర్ అవర్స్ ఇప్పుడు పెట్టడం మంచిదే అయినప్పటికీ ఆంక్షలు విమర్శలకు దారితీస్తున్నాయి. మరి దీనిపై సచివాలయ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి అంటున్నారు.