తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణకు సమయం వంటి అంశాలను ప్రభుత్వం, ఎన్నికల సంఘం కోర్టు దృష్టికి తీసుకువచ్చాయి. కోర్టు తీర్పుతో సర్పంచ్ ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు..