హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీలో సందడి చేశారు. పార్లమెంట్ ఆవరణలో సైకిల్పై విహరిస్తూ కనిపించారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, మనోహర్ లాల్ ఖట్టర్లను కలిసి హిందూపురం అభివృద్ధికి విజ్ఞప్తులు అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. ఇదిలా ఉండగా, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పేరుతో జరుగుతున్న మోసపూరిత విరాళాల సేకరణపై ఆయన స్పందించారు. ఇలాంటి వాటిని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.