Sattenapalli Cyber Criminal Reverse Shock: పల్నాడు జిల్లాలో ఎల్ఐసీ ఏజెంట్ శ్రీనివాసరావు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండి, కూతురు డ్రగ్స్ కేసులో ఇరుక్కుందనే బెదిరింపును తిప్పికొట్టారు. తెలివిగా వ్యవహారించడంతో సీన్ రివర్స్ అయ్యింది. ఇదిలా ఉండగా, ప్రజలు డిజిటల్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింక్లను తెరవకూడదని పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పథకాల గురించి అవగాహన లేని లబ్ధిదారులను మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు.