హైదరాబాద్ సీపీ సజ్జనార్.. ఆర్బీఐ గవర్నర్కు లేఖ రాశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలు.. సైబర్ నేరగాళ్లకు వరంగా మారాయని అందులో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరాలను కంట్రోల్ చేయడానికి.. బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సైబర్ పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్లో నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లను బ్యాంక్ సిబ్బంది సమకూర్చినట్లు ఆర్బీఐ గవర్నర్కు రాసిన లేఖలో సీపీ సజ్జనార్ గుర్తు చేశారు.