ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ మోసానికి గురై రూ.12 లక్షలు పోగొట్టుకున్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలానా పేరుతో వచ్చిన ఫేక్ లింక్ను క్లిక్ చేయడంతో ఆయన ఫోన్లోకి మాల్వేర్ చేరి బ్యాంక్ ఖాతా ఖాళీ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపరిచిత లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోసపోతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.