సొంత పంటను నాశనం చేసిన రైతులు.. కారణం తెలిస్తే శెభాష్ అనాల్సిందే!

1 year ago 27
Farmers Destroyed Ganja in Alluri district: అల్లూరి జిల్లాలో రైతులు తమ పంటను తామే ధ్వంసం చేసుకున్నారు. కొయ్యూరు మండలంలో కొంతమంది రైతులు 15 ఎకరాలలో గంజాయిని సాగుచేశారు. అయితే గంజాయి సాగువలన కలిగే అనర్థాలపై ప్రభుత్వం, అధికారులు కల్పించిన అవగాహనతో రైతుల్లో చైతన్యం కలిగింది. దీంతో రైతులు 15 ఎకరాల్లోని గంజాయి పంటను ధ్వంసం చేశారు. అనంతరం తగలబెట్టారు. రైతులు చేసిన పనికి అధికారులు ప్రశంసించారు. మరోవైపు గంజాయి సాగు వదిలి ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లేలా మన్యం, ఏజెన్సీ రైతుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది.
Read Entire Article