ఏపీలో క్యాప్ జెమినీ సంస్థ రానుంది. ఇవాళ మంత్రి నారా లోకేష్తో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. క్యాప్ జెమినీకి భూ కేటాయింపులు, తాత్కాలిక క్యాంపస్కు సంబంధించి ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటికే ఆ సంస్థ ఏర్పాటు కోసం విశాఖలో 20 ఎకరాల భూమిని పరిశీలించారు. అయితే తాత్కాలికంగా సేవలు అందించేందుకు మాత్రం ఒక ప్రైవేటు బిల్డింగ్ను ఎంపిక చేశారు. దీంతో త్వరలోనే ఏపీలో క్యాప్ జెమినీ సేవలు ప్రారంభం కానున్నాయి.