ఉద్యాన పంటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందిస్తున్నాయి. నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా టమాట, గులాబీ సాగుకు రూ.1.12 కోట్ల వరకు సబ్సిడీ లభిస్తుంది. పండ్ల తోటల సాగుకు రూ.75 లక్షల వరకు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి కూడా రాయితీలు ఇస్తున్నారు. ఆయిల్ పామ్ సాగుకు ఉచితంగా మొక్కలు అందిస్తున్నారు. అంతే కాకుండా.. అర ఎకరం భూమిలో తీగజాతి కూరగాయలకు పందిరి వేసుకోవడానికి రూ.50 వేలు సబ్సిడీ కింద రైతులు అందుకోవచ్చు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.