సోషల్ మీడియాలో ఆ థంబ్ నెయిల్స్, హెడ్డింగ్స్ వద్దు.. హోం మంత్రి అనిత

7 months ago 18
మొంథా తుపాను వేళ.. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఓ వార్నింగ్ ఇచ్చారు. తుపానుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తుపాను గురించి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మొంథా తుపానుపై సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని కోరారు. తుపాను గురించి ప్రజలను తప్పుదారి పట్టించేలా థంబ్‌నెయిల్స్‌ పెట్టవద్దని అన్నారు. సంచలన హెడ్డింగ్స్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల్లో పూర్తి సన్నద్ధంగా ఉన్నామని.. గందరగోళానికి ఆస్కారం ఇవ్వొద్దని కోరారు.
Read Entire Article