మీడియాతో మాట్లాడే సమయంలో, సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జనసైనికులకు అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. అలాంటి వేళల్లో పార్టీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. వ్యక్తిగత విషయాలు, దూషణల జోలికి వెళ్లవద్దని, జనసేన సిద్ధాంతం, భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రెచ్చగొట్టేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.