Kakinada School Students Reliance Quiz Competition: రిలయన్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ధీరూభాయ్ అంబానీ పేరుతో క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చు. రవాణా ఖర్చులు కూడా అందిస్తారు. విజేతలకు ల్యాప్టాప్లు, సైకిళ్లు వంటి బహుమతులు ఉంటాయి. నవంబర్ 30 లోగా నమోదు చేసుకోవాలి. డిసెంబర్ 4న కాకినాడలో ఈ క్విజ్ పోటీలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలియజేశారు.