కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించబోతోంది. ఈ పథకం పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ వంటి ఐదు రకాల బస్సుల్లో అందుబాటులో ఉంటుంది. తిరుపతి-తిరుమల సప్తగిరి బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులకు మినహాయింపు ఉంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించింది.