ఏపీలోని దివ్యాంగులకు గుడ్న్యూస్. ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. 'స్త్రీ శక్తి పథకం' కింద దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 50 శాతం రాయితీతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా.. ఇక నుంచి ఉచితంగా ఆయా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు.