స్థానిక ఎన్నికలపై జనసేన పార్టీ ఫోకస్ పెంచింది. స్థానిక ఎన్నికల్లో జనసైనికుల ఆత్మగౌరవం నిలబెడతామని గురువారం నాటి సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలాగే స్థానిక ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాల తయారీకి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు కూడా. తాజాగా జనసేన పార్టీ14 మందితో స్థానిక సంస్థల ఎన్నికల విధివిధానాల రూపకల్పన కమిటీని ప్రకటించింది. ఇందులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు లేకపోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.