స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్‌డేట్.. ఆగస్టు 23న నిర్ణయం..

6 months ago 11
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేడు ఉదయం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సందిగ్ధత, ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధించిన గడువుపై చర్చించారు. సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించనున్నారనే దానిపై ఓ క్లారిటీ వచ్చేందుకు కీలకంగా భావిస్తున్న PAC సమావేశం తేదీ ఖరారుపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది.
Read Entire Article