స్మార్ట్ మీటర్లు బిగించే విషయంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అలాగే స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో అపోహలు ప్రచారం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో స్మార్ట్ మీటర్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోనూ పదివేల పీఎం సూర్య ఘర్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు.