హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి (NH-65) త్వరలో అత్యాధునిక సాంకేతికతతో 'హై సెక్యూరిటీ స్మార్ట్ హైవే'గా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల రోడ్డును ఆరు వరుసలుగా విస్తరిస్తున్నారు. హైవేపై భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. 231 అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టుతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమివ్వనుంది.