ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించారు చంద్రబాబు. స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరిలో పర్యటించిన చంద్రబాబు.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న పనుల వివరాలు అడిగిన చంద్రబాబు.. పట్టాభికి చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. లీడర్ అనే వాడు మాట్లాడటం మాత్రమే కాదని.. దానిని అమలు చేసి చూపించాలన్నారు.