Telangana Government School Students Cash Prize: తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుకను ప్రకటించింది. పదో తరగతి, ఇంటర్మీడియట్లో జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు రూ. 10,000 చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. ప్రతి జిల్లాలో నలుగురు పదో తరగతి విద్యార్థులకు, నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ విద్యార్థులను జిల్లా స్థాయిలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సత్కరించి, ప్రశంసాపత్రం అందజేస్తారు.