తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన చోట్ల అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ప్రతి ఓటూ కీలకమని, స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలని సూచించారు. 90కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలా ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. కౌన్సిలర్లు చేజారకుండా.. ఎక్స్-అఫీషియో ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పక్కా వ్యూహాన్ని ఖరారు చేశారు.