హనుమాన్ మాల వేసుకున్న విద్యార్థిని స్కూల్లోకి యాజమాన్యం అనుమతించకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఇక ఈ విషయం కాస్తా బజరంగ్ దళ్ కార్యకర్తలకు తెలిసింది. దీంతో వాళ్లు కూడా ఆ స్కూల్ వద్దకు చేరుకుని.. ఆందోళన చేపట్టారు. హనుమాన్ మాల వేసుకున్నంత మాత్రాన స్కూల్లోకి అనుమతించకపోవడం ఏంటని మండిపడుతున్నారు.