ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇండ్లు నిర్మించుకోవాలనుకుంటున్న పట్టణ లబ్ధిదారులకు శుభవార్త. స్థల పరిమితులు, నిబంధనల కారణంగా నిలిచిపోయిన నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం జీ+1 నిర్మాణానికి అనుమతిని సడలించింది. చిన్న స్థలాల్లోనూ రెండు అంతస్తుల వరకు ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయంతో సొంత ఇంటి కల నెరవేరనుందని పేదలు ఆశిస్తున్నారు.