ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే.. ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. హరీష్ రావు దుబాయ్ టూర్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా హరీష్ రావు దుబాయ్ టూర్ గురించి ప్రస్తావిస్తూ సంచలన అనుమానాలు వ్యక్తం చేశారు.