హెచ్ఎండీఏ నిర్వహించిన మోకిల లేఅవుట్ ప్లాట్ల వేలానికి అద్భుత స్పందన లభించింది. తొలిరోజు కేటాయించిన 50 ప్లాట్లు పూర్తిగా అమ్ముడుపోగా.. నేడు మరో 50 ప్లాట్లకు వేలం జరగనుంది. గతంలో రేట్లు కృత్రిమంగా పెంచి చెల్లింపులు చేయని నకిలీ కొనుగోలుదారుల ఆటకట్టించేందుకు ఈసారి దరావత్తు మొత్తాన్ని అధికారులు భారీగా పెంచారు. ఐటీ రంగానికి సమీపంలో ఉండటంతో ఎన్ఆర్ఐలు, వ్యాపారులు ఇక్కడ పెట్టుబడులకు ఎగబడుతున్నారు. మేడిపల్లి తర్వాత మోకిల ప్లాట్లకు మంచి స్పందన రావటం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊపునిచ్చింది.